నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం
ABN , First Publish Date - 2021-01-27T05:53:21+05:30 IST
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం
ఏసీపీ యాదగిరిరెడ్డి
యాచారం: నేరాల నియంత్రణలో సీసీ కెమెరా లు కీలకమని, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజా ప్రతినిధులు ముందుకు రావాలని ఇబ్రహీంప ట్నం ఏసీపీ వి.యాదగిరిరెడ్డి అన్నారు. మంగళవా రం నందివనపర్తిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు బీఎన్రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్రెడ్డి, సర్పంచ్ ఉ దయశ్రీ ఏసీపీకి రూ.3లక్షల చెక్కును ఏసీపీకి అందించారు. ఏసీపీ మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు మరో రూ.రెండు లక్షలు గ్రామస్థులు సమకూర్చాలని కోరారు. సీసీ కెమెరాల ఆధారంగానే చోరీలకు పాల్పడిన నిందితులను పట్టుకున్నట్లు చెప్పా రు. కార్యక్రమంలో సీఐ లింగయ్య, వార్డు సభ్యులు రామనాథంగుప్తా, గ్రామస్థులు పాల్గొన్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు చందాల సేకరణ
మాడ్గుల:చంద్రాన్పల్లిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్థుల నుంచి సర్పంచ్ యాదిరెడ్డి, ఎంపీటీసీ జై పాల్రెడ్డి రూ.లక్ష చందాలు సేకరించి ఎస్సై బద్యానాయక్కు మంగళవారం చెక్కు రూపంలో అందజేశారు. సీసీ కెమెరాలకు మిగతా డబ్బు వారంలోగా అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ వసంత మల్లేష్, నాయకులు నర్సిరెడ్డి, కొండల్, తానయ్య, రామకృష్ణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.