సీసీఐని పునరుద్ధరించాలి

ABN , First Publish Date - 2022-05-19T05:08:59+05:30 IST

ఆదిలాబాద్‌ సీసీఐ పునరుద్ధరించాలని జైనథ్‌ ఎంపీపీ ఎం.గోవర్ధన్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

సీసీఐని పునరుద్ధరించాలి

జైనథ్‌, మే18: ఆదిలాబాద్‌ సీసీఐ పునరుద్ధరించాలని జైనథ్‌ ఎంపీపీ ఎం.గోవర్ధన్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సీసీఐ ఫ్యాక్టరీ సామగ్రిని అమ్మకాన్ని నిరసిస్తూ బుధవారం ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను జైనథ్‌ బస్టాండ్‌ వద్ద దహనం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్ముకోవడం సరికాదని, నేటి యువతకు ఉపాధి కల్పించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి పి.గణేష్‌యాదవ్‌, సర్పంచ్‌ డి.దేవన్న, నాయకులు గడ్డంజగదీశ్‌రెడ్డి, కైపెల్లి రూపేష్‌, మండల టీఆర్‌ఎస్‌ శ్రేణులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-19T05:08:59+05:30 IST