‘పట్నం’లో రూ.5కోట్లతో సీసీ రోడ్లు
ABN , First Publish Date - 2021-11-28T05:20:57+05:30 IST
‘పట్నం’లో రూ.5కోట్లతో సీసీ రోడ్లు
ఇబ్రహీంపట్నం: మిషన్ భగీరథ పనుల్లో పాడైపోయిన సీసీ రోడ్ల పునర్నిర్మాణానికి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రూ.5కోట్లు ఖర్చు చేస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తెలిపారు. ఈ మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ్-2021 అవార్డునందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులు, సిబ్బందిని సన్మానించారు. పారిశుధ్య పనులకు ప్రాధాన్యం ఇస్తూ డంప్యార్డు నిర్మిస్తున్నామని ఆయన గుర్తుచేశారు. పచ్చదనం పెంపునకు కౌన్సిలర్లు దృష్టిసారించాలన్నారు. చెత్త బుట్టల్లోనే నిల్వచేసి మున్సిపల్ వాహనాల్లో వేయాలన్నారు. అవార్డు మన బాధ్యతను మరింత పెంచిందన్నారు. నల్లాల ఏర్పాటు పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే ఏ పనైనా అనుకున్న సమయంలోగా పూర్తవుతుందన్నారు. చైర్పర్సన్ స్రవంతి, కమిషనర్ యూసుఫ్, వైస్చైర్మన్ యాదగిరి పాల్గొన్నారు.