సీబీఎస్ఈ విద్యార్థులు ఇక ‘ఫెయిల్’ అవరు!
ABN , First Publish Date - 2020-02-20T09:33:11+05:30 IST
సీబీఎ్సఈ విద్యార్థులకు శుభవార్త! 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులెవరూ ఇకపై ‘ఫెయిల్’ అయ్యే ప్రసక్తే లేదు! ఈ ఏడాది నుంచే ఈ విధానం అందుబాటులోకి రానుంది!
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: సీబీఎ్సఈ విద్యార్థులకు శుభవార్త! 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులెవరూ ఇకపై ‘ఫెయిల్’ అయ్యే ప్రసక్తే లేదు! ఈ ఏడాది నుంచే ఈ విధానం అందుబాటులోకి రానుంది! పది, 12వ తరగతి విద్యార్థుల మార్కుల జాబితాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ‘ఫెయిల్డ్’, ‘కంపార్ట్మెంటల్’ పదాలను తొలగించాలని సీబీఎ్సఈ నిర్ణయించింది. ఉత్తీర్ణత మార్కులు సాధించలేని విద్యార్థులకు ఏ పదం వాడాలన్న విషయాన్ని తేల్చేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని బోర్డు తెలిపింది.