ఆదివాసీలకు కులధ్రువీకరణ పత్రాలివ్వాలి
ABN , First Publish Date - 2021-04-13T05:13:55+05:30 IST
తమకు కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని తహశీల్దార్ కార్యాలయంలో కొందరు ఆదివాసీలు సోమవారం తహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
ఎటపాక, ఏప్రిల్ 12: తమకు కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని తహశీల్దార్ కార్యాలయంలో కొందరు ఆదివాసీలు సోమవారం తహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు. మండలంలోని కృష్ణవరం పంచాయతీలో కొందరు తమ బంధువులకు సర్టిఫికెట్లు ఇచ్చారని, తమకు కూడా ఇవ్వాలని ఆధార్కార్డులు, రేషన్కార్డులు, కులధ్రువీకరణ పత్రా లివ్వాలని కోరారు. కులధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో విద్యార్థులకు సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కోల్పోతున్నామన్నారు. కార్యక్రమంలో సాయం లక్ష్మయ్య, దుర్గారావు, సీతయ్య, సుశీల, మార్త, రింకుబాబు, వెట్టి రాములమ్మ, సోడే లక్ష్మి, సోడే ముత్తమ్మ పాల్గొన్నారు.