మాజీ న్యాయమూర్తి శ్రావణ్‌కుమార్‌పై కేసు

ABN , First Publish Date - 2022-01-22T06:44:12+05:30 IST

మాజీ న్యాయమూర్తి శ్రావణ్‌కుమార్‌పై కేసు

మాజీ న్యాయమూర్తి శ్రావణ్‌కుమార్‌పై కేసు

జి.కొండూరు, జనవరి 21: మాజీ న్యాయమూర్తి జె.శ్రావణ్‌కుమార్‌పై జి.కొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. గంగినేనిపాలెంలో ముగ్గురు దళిత యువకులపై వైసీపీ నేతల దాడి ఘటనలో నిందితులను అరెస్టు చేయాలని ఈనెల 20న జి.కొండూరు పంచాయతీ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై బాధితుల బంధువులతో రాస్తారోకో చేసి దారిని దిగ్బంధించి ప్రజా జీవనానికి ఇబ్బందులు కలిగించినందుకు, అక్రమ సమావేశం నిర్వహించినందుకు, కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయనతో పాటు మరో 15 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆర్‌.ధర్మరాజు తెలిపారు.


Updated Date - 2022-01-22T06:44:12+05:30 IST