కరోనాతో ఫిషరీస్ ఏడీ పూర్ణయ్య మృతి
ABN , First Publish Date - 2021-04-19T06:12:21+05:30 IST
అవనిగడ్డ మత్స్యశాఖ కార్యాలయంలో కొద్దిరోజుల క్రితం వరకు ఇన్చార్జ్ ఏడీగా విధులు నిర్వహించిన తమ్ము పూర్ణయ్య (57) కరోనాతో మృతి చెందారు.
అవనిగడ్డ టౌన్, ఏప్రిల్ 18 : అవనిగడ్డ మత్స్యశాఖ కార్యాలయంలో కొద్దిరోజుల క్రితం వరకు ఇన్చార్జ్ ఏడీగా విధులు నిర్వహించిన తమ్ము పూర్ణయ్య (57) కరోనాతో మృతి చెందారు. నాగాయలంక మండలం ఏటిమొగకు చెందిన పూర్ణయ్య మత్స్యశాఖ ఎఫ్డీవోగా సుదీర్ఘకాలం ఈ ప్రాంతంలో విధులు నిర్వహించి కొద్దికాలం క్రితం ఏడీగా పదోన్నతి పొంది మచిలీపట్నం వెళ్లారు. ఇక్కడి ఏడీ పోస్టు ఖాళీ అవ్వటంతో కొద్దికాలంపాటు ఇన్చార్జ్గా పని చేసిన పూర్ణ య్య ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఆర్వోగా కూడా వ్యవహరించారు. వారం రోజులుగా కరోనాతో బాధపడుతూ విజయవాడలో చికిత్స పొంది, రెండు రోజుల క్రితం డిశ్చార్జి అయ్యారు. శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించటంతో విజయవాడ తరలించగా, చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. పూర్ణయ్య మృతి పట్ల దివి ప్రాంత మత్స్యకారులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.