ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 13 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-03-03T04:46:11+05:30 IST
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 13 మందికి కరోనా
కొత్తగూడెం కలెక్టరేట్/ఖమ్మం సంక్షేమవిభాగం, మార్చి 2: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం 13 మంది కొవిడ్బారిన పడినట్టు నిర్ధారణైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 562మందికి పరీక్షలు నిర్వహించగా.. తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కొత్తగూడెం డివిజన్లో ఇద్దరు, భద్రాచలం డివిజన్లో ఏడుగురు కొవిడ్ బారిన పడ్డారు. ఇక ఖమ్మం జిల్లాలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అధికారులు తమ రోజువారీ నివేదికలో వెల్లడించారు.