ఆశ్రంలో జర్నలిస్టులకు ప్రత్యేక వార్డు : కలెక్టర్
ABN , First Publish Date - 2021-05-12T05:55:10+05:30 IST
ప్రింట్ అండ్ ఎలకా్ట్రనిక్ మీడియాలో పనిచేస్తూ కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులకు ఆశ్రం ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును కేటాయించి నట్టు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఉత్తర్వులు జారీచేశారు.
ఏలూరు ఫైర్స్టేషన్, మే 11 : ప్రింట్ అండ్ ఎలకా్ట్రనిక్ మీడియాలో పనిచేస్తూ కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులకు ఆశ్రం ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును కేటాయించి నట్టు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఉత్తర్వులు జారీచేశారు. ఆశ్రంలో రూమ్ నెంబర్ 210లో 20 పడకలు జర్నలిస్టులకు కేటాయించామన్నారు. ఆశ్రం యాజమాన్యం తగిన ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గుర్తింపు కార్డు లేదా అక్రిడేషన్ కార్డు ద్వారా జర్నలిస్టులు కోవిడ్ బారినపడిన వారు ఆక్సిజన్ అవ సరం అయ్యే పరిస్థితి ఉంటే ఈ అవకాశం వినియోగించుకోవచ్చు. ఆశ్రం ఆసుపత్రి వైద్య అధికారుల ఫోన్ నెంబర్లు డాక్టర్ రామ్మోహన్ ఫోన్ నెంబర్ 89190 74061, ఎస్. చక్రవర్తి 93904 19756, పి.సోమరాజు 99120 77977.