రోగ నిరోధక శక్తితో కరోనా అంతం

ABN , First Publish Date - 2020-12-02T05:02:39+05:30 IST

రోగ నిరోధక శక్తితో కరోనా అంతం

రోగ నిరోధక శక్తితో కరోనా అంతం
పెద్దతూప్రలో అవగాహన ర్యాలీలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న విద్యార్థులు

శంషాబాద్‌రూరల్‌: రోగ నిరోధక శక్తితో కరోనా అంతమవుతుందని డాక్టర్‌ సుధామతి అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆయూష్‌ మంత్రిత్వ శాఖ అదేశాలకు అనుగుణంగా జిమ్స్‌ హోమియోపతి మెడికల్‌ కళాశాల, జిమ్స్‌ ఆసుపత్రి అధ్వర్యంలో మంగళవారం పెద్దతూప్రలో సర్పంచ్‌ చిటికెల వెంకటయ్యతో కలిసి కరోనా నివారణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మాట్లాడుతూ రోగ నిరోధక శక్తితో  కరోనా  అంతమవుతుందన్నారు.  రోగ నిరోధక శక్తి పెరగాలంటే  పౌష్ఠికాహారం తీసుకోవాలని సూచించారు. కరోనా రెండో దశకు చేరుకుంటోందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మాస్క్‌, శానిటైజర్‌  వాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు విరాజ్‌, రమ్యకృష్ణ, ఉపసర్పంచ్‌ వెంకటయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T05:02:39+05:30 IST