ఒమైక్రాన్‌ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-01-22T05:30:00+05:30 IST

ఒమైక్రాన్‌ వ్యాప్తి చెందకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు.

ఒమైక్రాన్‌ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
సూర్యాపేటలో బూస్టర్‌ డోస్‌ వేయించుకుంటున్న రాజ్యసభ సభ్యుడు లింగయ్యయాదవ్‌

సూర్యాపేట టౌన్‌, జనవరి 22 : ఒమైక్రాన్‌ వ్యాప్తి చెందకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో బూస్టర్‌ డోస్‌ టీకాను శనివారం తీసుకొని మాట్లాడారు. కొవిడ్‌ వ్యాప్తి నియం త్రణకు, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ టీకాలు వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ దండ మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T05:30:00+05:30 IST