నది వరదనీటిలో కొట్టుకువచ్చిన ఏనుగు కళేబరం

ABN , First Publish Date - 2020-08-07T13:24:16+05:30 IST

భారీవర్షాల వల్ల వచ్చిన వరదల్లో ఓ గజరాజు కొట్టుకుపోయి మరణించిన ఘటన....

నది వరదనీటిలో కొట్టుకువచ్చిన ఏనుగు కళేబరం

ఎర్నాకుళం(కేరళ): భారీవర్షాల వల్ల వచ్చిన వరదల్లో ఓ గజరాజు కొట్టుకుపోయి మరణించిన ఘటన కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో జరిగింది. కేరళ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో ఎర్నాకుళం జిల్లాలోని నేరియామంగళం వద్ద ఉన్న పెరియార్ నది పొంగి ప్రవహిస్తోంది. పెరియార్ నది వరదనీటిలో నేరియా మంగళం గ్రామం వద్ద ఓ ఏనుగు కళేబరం కొట్టుకువచ్చింది. ఏనుగు 3 రోజుల క్రితం మరణించి ఉంటుందని అటవీశాఖ అధికారులు చెప్పారు. నదిలో ఏనుగు కళేబరం కొట్టుకువచ్చిన వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు. వరదల వల్ల గజరాజు మరణించిందనే విషయం వైరల్ అయింది. 

Updated Date - 2020-08-07T13:24:16+05:30 IST