కారు - టాటా మ్యాజిక్‌ వాహనం ఢీ

ABN , First Publish Date - 2021-10-20T05:03:00+05:30 IST

రాజంపేట మండలం బోయనపల్లె వైజంక్షన్‌ క్రాస్‌ వద్ద మంగళవారం కారు-టాటా మ్యాజిక్‌ ఢీకొన్న సంఘటనలో నలుగురికి గాయాలైనట్లు రూరల్‌ ఏఎ్‌సఐ సుబ్బయ్య తెలిపారు.

కారు - టాటా మ్యాజిక్‌ వాహనం ఢీ

 నలుగురికి గాయాలు 

రాజంపేట టౌన్‌, అక్టోబరు19 : రాజంపేట మండలం బోయనపల్లె వైజంక్షన్‌ క్రాస్‌ వద్ద మంగళవారం కారు-టాటా మ్యాజిక్‌ ఢీకొన్న సంఘటనలో నలుగురికి గాయాలైనట్లు రూరల్‌ ఏఎ్‌సఐ సుబ్బయ్య తెలిపారు.  కడప నుంచి రాజంపేట వస్తున్న కారు బోయనపల్లె వద్ద ఉన్న వైజంక్షన్‌ క్రాస్‌ వద్ద బైౖపాసు నుంచి రాజంపేట పట్టణంలోకి మలుపు తిరుగుతుండగా తిరుపతి నుంచి కడప వైపు వెళుతున్న మినీటాటా మ్యాజిక్‌ వాహనం ఢీకొంది. కాగా ఈ ప్రమాదంలో కారు బోల్తా పడిందన్నారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న జార్ఖండ్‌, యుగంధర్‌లకు గాయాలయ్యాయని, అలాగే టాటామ్యాజిక్‌ డ్రైవర్‌ గంగయ్య, ప్రతా్‌పకు గాయాలయ్యాయన్నారు. వీరిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. జార్ఖండ్‌ అనే వ్యక్తికి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించడం జరిగిందన్నారు. బైపాసు రోడ్డుపై వాహనాలు ప్రమాదం జరగడంతో గంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందన్నారు. 

Updated Date - 2021-10-20T05:03:00+05:30 IST