కారు బోల్తా.. వృద్ధురాలు మృతి
ABN , First Publish Date - 2022-07-01T05:30:00+05:30 IST
కారు బోల్తా.. వృద్ధురాలు మృతి
యాచారం, జూలై 1: కారు బోల్తాపడి ఓ వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన మండలంలోని తమ్మలోనిగూడ గేటు వద్ద శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. కోదడకు చెందిన జంగయ్య తన అత్త నర్సమ్మ(65), బంధువులు సాయిచరణ్, నిరంజన్లతో కలిసి నగరంలోని కర్మాన్ఘట్కు వెళ్తున్నారు. ఈక్రమంలో తమ్మలోనిగూడ గేటువద్ద ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నర్సమ్మ తీవ్రగాయాలపాలైంది. కారు డ్రైవర్ జంగయ్య, నిరంజన్, సాయిచరణ్, నర్సమ్మలకు స్వల్పగాయాలయ్యాయి. నర్సమ్మను చికిత్స నిమిత్తం నగరంలోని ఓప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపాల్ తెలిపారు.