ప్రశ్నించే గొంతుకను ఆపలేరు : టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2021-01-16T05:01:19+05:30 IST

వైసీపీ ప్రభుత్వ వైఫల్యంపై ప్ర శ్నించే ప్రతి గొంతుకను అరెస్ట్‌తో ఆపలేరని టీడీపీ నేతలు పేర్కొ న్నారు.

ప్రశ్నించే గొంతుకను  ఆపలేరు : టీడీపీ నేతలు
సింహాద్రిపురంలో లతారెడ్డిని పరామర్శిస్తున్న టీడీపీ నేతలు

సింహాద్రిపురం, జనవరి 15: వైసీపీ ప్రభుత్వ వైఫల్యంపై ప్ర శ్నించే ప్రతి గొంతుకను అరెస్ట్‌తో ఆపలేరని టీడీపీ నేతలు పేర్కొ న్నారు. గురువారం సింహాద్రిపు రంలో ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఇం ట్లో కడప అసెంబ్లీ టీడీపీ ఇన్‌ చార్జ్‌ అమీర్‌బాబు, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్ర సాద్‌, కడప పార్లమెంటు తెలుగు మహిళా అధ్యక్షురాలు కర్నాటి శ్వేతారెడ్డి, బద్వేలు టీడీపీ నేతలు కర్నాటి వెంకటరెడ్డి బీటెక్‌ రవి సతీమణి లతారెడ్డిని కలసి పరామర్శించి ఆమెకు ధైర్యం చెప్పారు.

అనంతరం వారు మాట్లాడుతూ టీడీపీ నేతలను అణచివేతకు గురిచేయాలని వైసీపీ ప్రయత్నిస్తే తిరుగుబాటు తీవ్రతరం చేస్తామన్నారు. బీటెక్‌ రవి  కుటుంబానికి పార్టీ, అండగా వుంటుందన్నారు. కార్యక్రమంలో గడ్డ గురప్ప, జయకుమార్‌, రాంప్రసాద్‌, అమీర్‌, శీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T05:01:19+05:30 IST