వృత్తిదారుల పథకాలను రద్దుచేయడం తగదు
ABN , First Publish Date - 2022-07-04T05:07:58+05:30 IST
మోదీ అధికారం చేపట్టిన నాటినుంచి కార్పొరేట్ల కోసం చేతివృత్తులను దెబ్బతీస్తున్నారని, వృత్తిదారులకు ఉన్న సంక్షేమ పథకాలు రద్దు చేయడం తగదని చేతివృత్తిదారుల రాష్ట్ర కన్వీనర్ ఎం. రామకృష్ణ పేర్కొన్నారు.
బద్వేలు, జూలై 3: మోదీ అధికారం చేపట్టిన నాటినుంచి కార్పొరేట్ల కోసం చేతివృత్తులను దెబ్బతీస్తున్నారని, వృత్తిదారులకు ఉన్న సంక్షేమ పథకాలు రద్దు చేయడం తగదని చేతివృత్తిదారుల రాష్ట్ర కన్వీనర్ ఎం. రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసి ఏపీ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేనేత, వడ్డెర, రజక, నాయీబ్రాహ్మణులకు కేంద్రప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. అలాగే స్థానిక పార్టీలు చేతి వృత్తిదారులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు తప్ప వారి ఉపాధి సామాజిక భద్రత , సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శులు శ్రీనివాసులు, నాగేంద్రబాబు, వృత్తిదారుల సంఘం నాయకులు పాల్గొన్నారు.