నేటి సాయంత్రం నుంచి కాల్వలకు నీటి నిలిపివేత
ABN , First Publish Date - 2021-04-19T05:27:52+05:30 IST
పశ్చిమ డెల్టా ప్రధా న కాలువలకు సోమవారం సాయంత్రం నుంచి నీటిని నిలిపివేస్తున్నట్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.దక్షిణామూర్తి తెలిపారు.
నిడదవోలు, ఏప్రిల్ 18: పశ్చిమ డెల్టా ప్రధా న కాలువలకు సోమవారం సాయంత్రం నుంచి నీటిని నిలిపివేస్తున్నట్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.దక్షిణామూర్తి తెలిపారు. వాస్తవానికి ఆదివా రం సాయంత్రమే నీటి విడుదల నిలిపివేయా ల్సి ఉన్నప్పటికీ అధికారుల ఆదేశాల మేరకు జి ల్లాలో తాగునీటి చెరువులను నింపుకునేందుకు మరోరోజు పొడిగించినట్టు తెలిపారు. తిరిగి జూన్ మొదటి వారంలో విడుదల చేస్తామని తెలిపారు.