ప్రశాంతంగా ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష

ABN , First Publish Date - 2022-08-08T05:49:49+05:30 IST

ఎస్సై ఉద్యోగాల భర్తీ కో సం ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాతం గా జరిగింది. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేం ద్రాలకు చేరుకున్నారు.

ప్రశాంతంగా ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష

నిర్మల్‌ చైన్‌గేట్‌, ఆగస్టు 7 : ఎస్సై ఉద్యోగాల భర్తీ కో సం ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాతం గా జరిగింది. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేం ద్రాలకు చేరుకున్నారు. ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌ పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 2,376 మంది అభ్యర్థులు ఎస్సై పరీక్షకు గాను అందులో 166 గైర్హాజరయ్యారన్నారు. అ ధునాతన టెక్నాలజీ ఉపయోగించి పరీక్షలు నిర్వహిస్తు న్నందున పరీక్షల నిర్వహణ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలు చేస్తున్నారని, దళారుల మాటలు నమ్మి డబ్బులు ఇచ్చి నష్టపోవద్దని నిరుద్యోగ యువతకు సూచించారు. పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బందికర సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయన వెంట అదనపు ఎస్పీ రామ్‌రెడ్డి, రీజినల్‌ కోఆర్డినేటర్‌ పీజీ రెడ్డి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌, సీఐలు శ్రీనివాస్‌, కుమార స్వామి, వెంకటేష్‌, ఐటీ కోర్‌ ఆర్‌ఎస్సై రవి కుమార్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T05:49:49+05:30 IST