ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేబినెట్ కార్యదర్శి గౌబా సమావేశం
ABN , First Publish Date - 2021-02-27T23:17:54+05:30 IST
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎనిమిది రాష్ట్రాల ముఖ్యు అధికారులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ : కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎనిమిది రాష్ట్రాల ముఖ్యు అధికారులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సమావేశమయ్యారు. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, బెంగాల్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గౌబా సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కోవిడ్ విస్తరించకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అంతేకాకుండా పాజిటివ్ వచ్చిన వారిని గుర్తించడం, వారు ఐసోలేషన్లో ఉండేట్లు చూసుకోవాలని ఆయా రాష్ట్రాల అధికారులకు గౌబా సూచించారు.