రుణ చెల్లింపులపై విచారణ చేయిస్తా : మంత్రి కొడాలి
ABN , First Publish Date - 2020-10-01T07:49:42+05:30 IST
నందివాడ మండలం రుద్రపాకలోని జోసఫ్ తంబి డ్వాక్రా గ్రూపు సభ్యుల రుణ చెల్లింపులపై సంబంధిత అధికారులతో విచారణ జరిపిస్తానని మంత్రి కొడాలి నాని హామీ ఇచ్చారు.
గుడివాడ, సెప్టెంబరు 30 : నందివాడ మండలం రుద్రపాకలోని జోసఫ్ తంబి డ్వాక్రా గ్రూపు సభ్యుల రుణ చెల్లింపులపై సంబంధిత అధికారులతో విచారణ జరిపిస్తానని మంత్రి కొడాలి నాని హామీ ఇచ్చారు. రాజేంద్రనగర్లోని మంత్రి నివాసంలో బుధవారం గ్రూపు సభ్యులు మంత్రిని కలసి తాము రుణం సకాలంలో చెల్లించినా ఇంకా రూ.75 వేలు బకాయి ఉన్నట్లు చూపిస్తున్నారన్నారు.
తాము రుణం తీసుకుని చెల్లించినట్లుగా సీసీ సంతకం చేసి ఉన్న మినిట్స్ పుస్తకం చూపించినా ఫలితం లేకపోయిందని గ్రూపు సభ్యులు వాపోయారు. డీఎంహెచ్వోగా నూతనంగా నియమితులైన సుహాసిని మంత్రి కొడాలి నానిని మర్యాదపూర్వకంగా కలిశారు.