బస్సులు ఫుల్.. ప్రయాణికులు నిల్
ABN , First Publish Date - 2020-05-30T09:12:49+05:30 IST
కరోనా ప్రభావంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు కనిపించడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన
షాద్నగర్: కరోనా ప్రభావంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు కనిపించడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన తరువాత షాద్నగర్ ఆర్టీసీ డిపో నుంచి పలు ప్రధానరూట్లలో బస్సులను నడిపిస్తున్నారు. అయితే వారంరోజులుగా హైదరాబాద్లో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం.. అంతేకాకుండా షాద్నగర్లో సైతం 8 కేసులు వెలుగుచూడడంతో ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు.
బస్టాండ్లో బస్సులు ఫుల్గా కనిపిస్తున్నా... ప్రయాణికులు మాత్రం పల్చగా కనిపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో కొంతమంది ప్రయాణిస్తున్నారు. బస్సులో సగంమంది కూడా ఎక్కడం లేదని, ఇలాగేఉంటే ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సిబ్బంది వాపోతున్నారు. శుక్రవారం షాద్నగర్ ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులు లేక బోసిబోయి కనిపించడం విశేషం.