బస్సు యాత్ర పోస్టర్ ఆవిష్కరణ
ABN , First Publish Date - 2022-05-25T06:01:02+05:30 IST
వైసీపీ తూర్పు నియోజకవర్గం కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు.
ఎంవీపీ కాలనీ, మే 24: వైసీపీ తూర్పు నియోజకవర్గం కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ బీసీలకు పెద్దపీట వేస్తూ వారి అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.