AP News: ఎమ్మెల్సీ పోతుల సునీత ఫొటోను తగలబెట్టిన టీడీపీ నాయకులు
ABN , First Publish Date - 2022-09-06T01:05:48+05:30 IST
Bapatla: టీడీపీ (TDP) శ్రేణులు చీరాలలో ఎమ్మెల్సీ (MLC) పోతుల సునీత (Potula Suneeta) ఫోటోను తగలబెట్టాయి. టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandra Babu) పై చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ.. పోతుల సునీత డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సునీత వ్యాఖ్యలకు నిరసనగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
Bapatla: టీడీపీ (TDP) శ్రేణులు చీరాలలో ఎమ్మెల్సీ (MLC) పోతుల సునీత (Potula Suneeta) ఫోటోను తగలబెట్టాయి. టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandra Babu) పై చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ.. పోతుల సునీత డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సునీత వ్యాఖ్యలకు నిరసనగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
ఇటీవల చంద్రబాబుపై ఎమ్మెల్సీ పోతుల సునీత తీవ్ర స్థాయిలో మండపడ్డారు. సారాకు చంద్రబాబు కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందన్నారు. చంద్రబాబు కుటుంబం పైకి పాల వ్యాపారమని చెబుతూ వెనక చేసేది సారా వ్యాపారమని ఆరోపించారు. చంద్రబాబు హయంలోనే డిస్టిలరీలు, బ్రూవరీలన్నింటికీ లైసెన్స్లు ఇచ్చారని.. 240 మద్యం బ్రాండ్లను చంద్రబాబే తీసుకొచ్చారని చెప్పారు. రాష్ర్టంలో ఏం జరిగినా ప్రభుత్వానికి ఆపాదిస్తూ బురద జల్లుడం టీడీపీ క్యాడర్కు పరిపాటిగా మారిందన్నారు.