ప్రయాణికులపై చార్జీల బాదుడు
ABN , First Publish Date - 2022-07-02T05:02:03+05:30 IST
ప్రయాణికులపై మరోసారి ఆర్టీసీ బాదుడుకు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. రెండునెల లు తిరక్కముందే మరోసారి ప్రజల నడ్డి విరిగేలా చార్జీల రూపంలో బాదింది.
కడప మారుతీనగర్, జూలై 1: ప్రయాణికులపై మరోసారి ఆర్టీసీ బాదుడుకు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. రెండునెల లు తిరక్కముందే మరోసారి ప్రజల నడ్డి విరిగేలా చార్జీల రూపంలో బాదింది. పల్లెవెలుగు బస్సులు మొదలుకొని దూరప్రాంత సర్వీసు బస్సులైన ఎక్స్ప్రెస్, అలా్ట్రడీలక్స్, సూపర్లగ్జరీ, ఇంద్ర, అమరావతి, తదితర అన్ని రకాల బ స్సుల చార్జీలను పెంచింది. డీజల్ ధరలు పెరిగాయనే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం చార్జీలను పెంచి ప్రజలను మరోసారి వంచనకు గురిచేసింది. టీడీపీ ప్రభుత్వ పాలనలో చార్జీలను పెంచగా నానా యాగి చేసిన ప్రస్తుత సీఎం జగన్ ఇవాల చార్జీలను వరుస క్రమంలో పెంచుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. అధికారం కోసం రకరకాల హామీలను గుప్పించడం వాటిని నిలుపుకోలేక జగన్రెడ్డి తంటాలు పడుతున్న తీరును చూసి అదే ప్రజ లు ఏమీ కాలమహిమ అని చర్చించుకుంటున్నారు.
కడప నుంచి బెంగుళూరు
సూపర్లగ్జరీ 450 480
ఇంద్ర 530 610
అమరావతి 720 750
కడప నుంచి హైదరాబాద్
సూపర్లగ్జరీ 640 740
ఇంద్ర 840 950
కడప నుంచి విజయవాడ
సూపర్లగ్జరీ (కావలి) 620 720
సూపర్లగ్జరీ(మార్కాపురం) 590 680
ఇంద్ర 790 910
అమరావతి 1020 1140
కడప నుంచి శ్రీశైలం
ఎక్స్ప్రెస్ 390 445
కడప నుంచి చెన్నై
సూపర్ లగ్జరీ 400 460
కడప నుంచి కర్నూల్
ఎక్స్ప్రెస్ 255 290
అలా్ట్రడీలక్స్ 310 355
కడప నుంచి తిరుపతి
ఎక్స్ప్రెస్ 170 190
అలా్ట్రడీలక్స్ 210 235
కడప నుంచి నెల్లూరు
ఎక్స్ప్రెస్ 225 250
కడప నుంచి అనంతపురం
ఎక్స్ప్రెస్ 195 220
కడప నుంచి మదనపల్లె
ఎక్స్ప్రెస్ 155 175
కడప నుంచి చిత్తూరు
ఎక్స్ప్రెస్ 210 235
కడప నుంచి మార్కాపురం
ఎక్స్ప్రెస్ 230 260