బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి
ABN , First Publish Date - 2022-05-28T05:54:43+05:30 IST
క్తాహిందూ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలకు క్షమాప
కోదాడటౌన్, మే 27 : ఏక్తాహిందూ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు షేక్ బాజాన్ డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మైనార్టీ సెల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో హిందూ, ముస్లింలు ఐక్యంగా జీవిస్తున్న క్రమంలో మసీదులు తవ్వేస్తాం, మదర్సాలను, దర్గాలను కూల్చివేస్తామనడం ఎంతవరకు సమంజసమన్నారు. తక్షణమే సంజయ్ ముస్లింలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గులాం, షాపుద్దిన్,, ముస్తాఫా, ఖాసీం, ఆలీ, జానిమియా, జహీర్, మహ్మద్, దాదావలి, బాషా, శోభన్ పాల్గొన్నారు.