భర్తకు కరోనా.. భార్య మృతి

ABN , First Publish Date - 2020-07-12T13:55:40+05:30 IST

భర్తకు కరోనా నిర్ధారణ కావడంతో మనోవేదనకు గురయి..

భర్తకు కరోనా.. భార్య మృతి

బుక్కరాయసముద్రం(అనంతపురం): భర్తకు కరోనా నిర్ధారణ కావడంతో మనోవేదనకు గురయి భార్య చనిపోయింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఉంటున్న దంపతుల్లో ఐదురోజుల క్రితం కొవిడ్‌ లక్షణాలు కనిపించాయి. వారికి పరీక్షలు నిర్వహించగా, శుక్రవారం భర్తకు సంబంధించిన ఫలితాలు వచ్చాయి. ఆయనకు పాజిటివ్‌ ఉన్నట్టు తేల్చడంతో భార్య ఒక్కసారిగా కుంగిపోయింది. భర్తను ఐసొలేషన్‌కు తరలించిన రెండు గంటలకే ఆమె కుప్పకూలిపోయి.. అక్కడికక్కడే చనిపోయింది. కాగా, ఆమె కూడా వైరస్‌ బారిన పడినట్లు వైద్యాధికారులు శనివారం ఉదయం ప్రకటించారు. 

Updated Date - 2020-07-12T13:55:40+05:30 IST