ప్రాధాన్యతా క్రమంలో భవన నిర్మాణాలు

ABN , First Publish Date - 2022-08-18T06:28:27+05:30 IST

ప్రాధాన్యతా క్రమంలో భవన నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ చూపి సత్వరమే పూర్తయ్యేలా చర్యలు చేప ట్టాలని మునగపాక మండల స్పెషల్‌ ఆఫీసర్‌ లింగేశ్వరరెడ్డి ఆదేశించారు. ఇక్కడి ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం సచివాలయ కార్యదర్శులు, ఇంజినీరింగ్‌ సిబ్బందితో ప్రభుత్వ పథకాల అమలుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు.

ప్రాధాన్యతా క్రమంలో భవన నిర్మాణాలు
సమావేశంలో మాట్లాడుతున్న లింగేశ్వరరెడ్డి

 అధికారులకు స్పెషల్‌ ఆఫీసర్‌ లింగేశ్వరరెడ్డి ఆదేశం

మునగపాక, ఆగస్టు 17 : ప్రాధాన్యతా క్రమంలో భవన నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ చూపి సత్వరమే పూర్తయ్యేలా చర్యలు చేప ట్టాలని మునగపాక మండల స్పెషల్‌ ఆఫీసర్‌ లింగేశ్వరరెడ్డి ఆదేశించారు. ఇక్కడి ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం సచివాలయ కార్యదర్శులు, ఇంజినీరింగ్‌ సిబ్బందితో ప్రభుత్వ పథకాల అమలుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. జగనన్న కాలనీ నిర్మాణాలు వేగంగా జరగాలని సూచించారు. వారానికి ఒకరోజు ప్రగతిపై సమీక్ష జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశాలకు  కార్యదర్శులు పూర్తి సమాచారంతో రావాలని ఆదేశించారు. ఎంపీడీవో రవికుమార్‌, ఈవోపీఆర్డీ ఈశ్వరరావు, మండల ఇంజనీర్‌ చంద్రశేఖర్‌, హౌసింగ్‌ ఏఈ కనకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T06:28:27+05:30 IST