ఢిల్లీలో కుప్పకూలిన భవంతి..
ABN , First Publish Date - 2022-04-25T20:10:28+05:30 IST
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సత్యనికేతన్ ప్రాంతంలోని ఓ భవంతి ..
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సత్యనికేతన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ భవంతి సోమవారంనాడు కుప్పకూలింది. శిథిలాల క్రింద ఐదుగురు కార్మికులు చిక్కుకుపోయినట్టు చెబుతున్నారు. ఆరు అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నాయి. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణాలు వెంటనే తెలియలేదు.