డ్రైనేజీలు నిర్మించండి

ABN , First Publish Date - 2022-05-24T06:28:31+05:30 IST

సంక్షేమ పథకాలు సరే... మా కాలనీలలో డ్రైనేజీలు నిర్మించ లేదని, దీంతో మురుగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని మహిళలు సోమవారం ఆదోని పట్టణంలోని కోయనగర్‌లో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు సమస్యలు ఏకరువు పెట్టారు.

డ్రైనేజీలు నిర్మించండి

మంత్రికి సమస్యలు విన్నవించిన మహిళలు

ఆలూరు, మే 23: సంక్షేమ పథకాలు సరే... మా కాలనీలలో డ్రైనేజీలు నిర్మించ లేదని, దీంతో మురుగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని మహిళలు సోమవారం ఆదోని పట్టణంలోని కోయనగర్‌లో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు సమస్యలు ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా కాలనీలలో మంత్రి జయరాం పర్యటించారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని గడపగడపకు వెళ్ళి తెలుసుకున్నారు.  వైసీపీ ప్రభుత్వం పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తూ ఒక్కో కుటుంబానికి నవరత్నాల ద్వారా రూ.లక్షలు లబ్ధ్ది చేకూరుస్తున్నారన్నారు.  అనంతరం కోయనగర్‌లో ఎంపీపీ  నిధులతో నిర్మించిన బోరు నీటి ట్యాం కులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి సోదరులు శ్రీనివాసులు, నారాయణస్వామి, మార్కెట్‌యార్డు వైస్‌ చైౖర్మన్‌ చిన్న ఈరన్న,  జడ్పీటీసీ ఏరూరు శేఖర్‌, ఎంపీపీ  సుభాషిణి, వైస్‌ ఎంపీపీ నాగవేణి, వైస్‌ సర్పంచు రవి, వార్డుమెంబర్‌ శేఖర్‌, ఎంపీడీవో అల్లాబకాష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-05-24T06:28:31+05:30 IST