కంకణాపల్లికి రోడ్డు నిర్మించండి
ABN , First Publish Date - 2021-04-11T05:44:49+05:30 IST
ఘాట్ రోడ్డు జాతీయ రహదా రి నుంచి మండలంలోని కంకణాపల్లి గ్రామానికి రోడ్డు నిర్మించాలని ఆ గ్రామ గిరిజనులు కోరుతున్నారు.
గిరిజనుల ఆందోళన
పాచిపెంట, ఏప్రిల్ 10: ఘాట్ రోడ్డు జాతీయ రహదా రి నుంచి మండలంలోని కంకణాపల్లి గ్రామానికి రోడ్డు నిర్మించాలని ఆ గ్రామ గిరిజనులు కోరుతున్నారు. ఈమేరకు శనివారం కంకణాపల్లి జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. ఘాట్ రోడ్డు జాతీయ రహదారి నుంచి రొడ్డవలస మీదుగా కంకణాపల్లి వెళ్లాలంటే సుమారు ఆరు కిలో మీటర్లు ఉంటుందని, అయితే జంక్షన్ వద్దగల బస్ షెల్టర్ నుంచి అడ్డు తోవలో రోడ్డు నిర్మిస్తే కేవలం రెండు కిలో మీటర్లతోనే కంకణాపల్లి చేరుకోవచ్చునని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులకు గురి కావల్సి వస్తోందన్నారు. పలుమార్లు అధికారులకు విన్నవించి నా స్పందించలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కంకణాపల్లికి అడ్డు రోడ్డు నిర్మించాలని ఆ గ్రామ గిరిజనులు కోరుతున్నారు. రోడ్డు నిర్మాణానికి తక్షణమే స్పందిం చాలని, లేదంటే ఆందోళన చేపడతామని సీపీఎం మండల కార్యదర్శి కోరాడ ఈశ్వర రావు తెలిపారు. కార్యక్రమం లో గిరిజనులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.