నిత్యావసరాల పెరుగుదలకు కేంద్రమే కారణం: బుగ్గన
ABN , First Publish Date - 2022-07-08T23:29:10+05:30 IST
నిత్యావసరాల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి విమర్శించారు.
గుంటూరు: నిత్యావసరాల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి విమర్శించారు. ఆర్థిక విధానాలపై వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. కరోనాకు తెగించి రాష్ట్రం కోసం ఢిల్లీ వెళ్లి డబ్బులు తెచ్చామని తెలిపారు. అమ్మఒడి, వసతిదీవెన, నాడు-నేడు వద్దని ప్రతిపక్షాలు చెప్పగలవా? అని ప్రశ్నించారు. ఏపీని శ్రీలంకతో పోల్చడం అసమంజసమని చెప్పారు. పెట్రో ధరలు దేశవ్యాప్తంగా పెరిగాయని తెలిపారు. లెక్కలు తేల్చడానికే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని వివరించారు. రాజధానికి గత ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.2 వేల కోట్లేనని పేర్కొన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పనులకు నిధులు చెల్లిస్తున్నామని చెప్పారు. కొవిడ్ సమయంలో పంచాయతీ నిధులతో కరెంట్ బిల్లులు కట్టామని బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు.