కొబ్బరి చిప్పల దొంగకు దేవాదాయశాఖ ఇస్తే...: బుద్దా వెంకన్న
ABN , First Publish Date - 2022-04-06T20:40:21+05:30 IST
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
విజయవాడ: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కొబ్బరి చిప్పల దొంగకు దేవాదాయ శాఖ ఇస్తే.. కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు. వెల్లంపల్లిని మంత్రి పదవి నుంచి తొలగించే ముందు ఆయన దోచుకున్న రూ. 1525 కోట్లను సీఎం జగన్ రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. కొబ్బరి చిప్పలు దొంగిలించే వ్యక్తికి దేవాదాయశాఖ మంత్రి పదవి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని, దొంగలకు మంత్రి పదవులు ఇచ్చారని బుద్దా వెంకన్న ఆరోపించారు.