విద్యుదాఘాతంతో బీటెక్‌ విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-05-25T04:59:01+05:30 IST

బీటెక్‌ విద్యార్థి అజిత్‌కుమార్‌రెడ్డి విద్యుత్‌ షాక్‌కు గురై మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి.

విద్యుదాఘాతంతో బీటెక్‌ విద్యార్థి మృతి
అజిత్‌కుమార్‌రెడ్డి మృతదేహం

పులివెందుల టౌన్‌, మే 24: బీటెక్‌ విద్యార్థి అజిత్‌కుమార్‌రెడ్డి విద్యుత్‌ షాక్‌కు గురై మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. తొండూరు మం డలం ఇనగలూరు వాసి అజిత్‌ ఇంట్లో ఉన్న మోటార్‌కు విద్యుత్‌ వైర్లు తగిలిస్తుండగా విద్యుత్‌ షాక్‌ కొట్టింది. దీంతో  ఆయన మరణించారు. చేతికొచ్చిన ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా అజిత్‌కుమార్‌రెడ్డి తండ్రి, పెదనాన్నలు ఇదివరకే మృతిచెందారు. ప్రస్తుతం అజిత్‌కుమార్‌రెడ్డికి తల్లి, చెల్లెలు ఉన్నారు. అజిత్‌ మృతదేహాన్ని స్థానిక పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

Updated Date - 2022-05-25T04:59:01+05:30 IST