బిహార్ ఎన్నికల్లో పోత్తును ప్రకటించిన మాయావతి
ABN , First Publish Date - 2020-09-29T22:57:17+05:30 IST
పోటీకి సిద్ధమవుతున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి ప్రకటించారు. ఒకవేళ బిహార్ ప్రజల ఆశీర్వాదంతో తమ కూటమి గెలిస్తే
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల పోరు ముంగిట కొత్త పొత్తులు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటములు రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడనున్నాయి. కాగా మరో జాతీయ పార్టీ స్థానిక పార్టీతో పొత్తు ప్రకటించింది. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ)తో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి ప్రకటించారు. ఒకవేళ బిహార్ ప్రజల ఆశీర్వాదంతో తమ కూటమి గెలిస్తే ఆర్ఎల్ఎస్పీ అధినేత ఉపేంద్ర కుశ్వానాను ముఖ్యమంత్రిని చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
‘‘రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ పోటీలోకి దిగుతోంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీతో పొత్తు ఖరారైంది. ఆ పార్టీ అధినేత ఉపేంద్ర కుశ్వానాతో అన్ని చర్చలు పూర్తయ్యాయి. మా కూటమి అభ్యర్థిగా ఉపేంద్ర కుశ్వానాను ప్రతిపాదించాం. బిహార్ ప్రజలు ఆశీర్వదిస్తే మా కూటమి అధికారంలోకి వస్తుంది, కుశ్వానా ముఖ్యమంత్రి అవుతారు’’ అని మాయావతి మీడియాకు తెలిపారు.