బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ యూనిట్‌ దగ్ధం

ABN , First Publish Date - 2021-09-29T07:22:23+05:30 IST

రేఖపల్లిలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ యూనిట్‌ విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైంది. వివరాలు ఇలా వున్నాయి... ఆపరేటర్‌గా పనిచేసే బొర్ర సత్యనారాయణ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో టవర్‌ యూనిట్‌ నుంచి పొగలు వస్తుండడాన్ని గమనించిన వారు అతడికి ఫోను చేశారు. వెంటనే అక్కడకు వెళ్లేటప్పటికే యూనిట్‌ చుట్టూ మంటలు చెలరేగాయి.

బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌   యూనిట్‌ దగ్ధం
మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో   చెలరేగిన మంటలు

రూ.70-80 లక్షల ఆస్తి నష్టం:  డీఈ సురేష్‌రెడ్డి

వరరామచంద్రాపురం, సెప్టెంబరు 28: రేఖపల్లిలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ యూనిట్‌ విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైంది. వివరాలు ఇలా వున్నాయి... ఆపరేటర్‌గా పనిచేసే బొర్ర సత్యనారాయణ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో టవర్‌ యూనిట్‌ నుంచి పొగలు వస్తుండడాన్ని గమనించిన వారు అతడికి ఫోను చేశారు. వెంటనే అక్కడకు వెళ్లేటప్పటికే యూనిట్‌ చుట్టూ మంటలు చెలరేగాయి.   అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. అప్పటికే  టవర్‌ యూనిట్‌ పూర్తిగా దగ్ధమైంది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే టవర్‌ యూనిట్‌ అగ్నిప్రమాదం జరిగిందన్నారు. సుమారు రూ.70-80 లక్షలు నష్టం వాటిల్లిందని విద్యుత్‌ శాఖ డీఈ సురేష్‌రెడ్డి తెలిపారు. సంఘటనా స్థలాన్ని జడ్పీటీసీ సభ్యుడు వాళ్ళ రంగారెడ్డి, వీఆర్‌ పురం ఎస్‌ఐ చంటి, తహశీల్దార్‌ శ్రీధర్‌, పలువురు నాయకులు పరిశీలించారు.




Updated Date - 2021-09-29T07:22:23+05:30 IST