కుప్పకూలిన కొత్త వంతెన

ABN , First Publish Date - 2022-01-23T15:08:33+05:30 IST

తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలో కొల్లిడం చెరువుపై కొత్తగా రూ.100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన హఠాత్తుగా శనివారం కూలిపడింది. తంజావూరు జిల్లాను చెన్నై సహా ఉత్తర జిల్లాలతో కలిపే విధంగా

కుప్పకూలిన కొత్త వంతెన

ప్యారీస్‌(చెన్నై): తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలో కొల్లిడం చెరువుపై కొత్తగా రూ.100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన హఠాత్తుగా శనివారం కూలిపడింది. తంజావూరు జిల్లాను చెన్నై సహా ఉత్తర జిల్లాలతో కలిపే విధంగా అనకరై ప్రాంతంలో ఉన్న పాత వంతెన కూల్చివేసి కొత్త వంతెన నిర్మాణపనులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, శనివారం ఉదయం ఈ వంతెన 5వ స్తంభం వద్ద సిమెంటు దిమ్మె హఠాత్తుగా కూలి చెరువు నీటిలో పడింది. దీనిపై అందిన సమాచారంతో జిల్లా ప్రజాపనుల శాఖ ఇంజనీర్లు, రెవెన్యూ శాఖ అధికారులు సంఘటనా స్థలికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు.

Updated Date - 2022-01-23T15:08:33+05:30 IST