ఉక్కపోతగా ఉంది.. కాసేపు డాబా మీదకు వెళ్తా.. అని భార్య అంటే సరేనన్నాడా భర్త.. పెళ్లిరోజే కోలుకోలేని షాకిచ్చింది..!

ABN , First Publish Date - 2021-07-31T16:36:52+05:30 IST

వారిద్దరికీ ఆ రోజే పెళ్లి జరిగింది.. పెళ్లి పనులతో అందరూ అలసిపోవడంతో ఎవరి గదుల్లో వారు నిద్రపోతున్నారు..

ఉక్కపోతగా ఉంది.. కాసేపు డాబా మీదకు వెళ్తా.. అని భార్య అంటే సరేనన్నాడా భర్త.. పెళ్లిరోజే కోలుకోలేని షాకిచ్చింది..!

వారిద్దరికీ ఆ రోజే పెళ్లి జరిగింది.. పెళ్లి పనులతో అందరూ అలసిపోవడంతో ఎవరి గదుల్లో వారు నిద్రపోతున్నారు.. పెళ్లి కూతురు మాత్రం గదిలో ఉండలేకపోయింది.. `ఉక్కపోతగా ఉంది.. కాసేపు డాబా మీదకు వెళ్తాన`ని భర్తను అడిగింది.. భర్త వెళ్లమన్నాడు.. అలా వెళ్లిన ఆమె ఇక ఎవరికీ కనిపించలేదు.. పెళ్లి జరిగిన తొలి రోజే భర్త కుటుంబానికి ఆమె కోలుకోలేని షాకిచ్చింది.. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు..


మధ్యప్రదేశ్‌లోని బింద్ ప్రాంతానికి చెందిన సోనూ జైన్‌కు వయసు మీద పడుతున్నా పెళ్లి కావడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పెళ్లి కుదరడం లేదు. దీంతో ఉదల్ కతిక్ అనే వ్యక్తి.. సోనూతో ఓ ఒప్పందం కుదుర్చుకున్నాడు. లక్ష రూపాయలు ఇస్తే అమ్మాయిని వెతికి పెళ్లి చేయిస్తానని చెప్పాడు. దీంతో సోనూ 90 వేల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించాడు. దీంతో ఉదల్ గత మంగళవారం అనితా రత్నాకర్ అనే యువతిని, ఆమె కుటుంబాన్ని సోనూ ఇంటికి తీసుకొచ్చాడు. అన్నీ మాట్లాడుకున్నాక బంధువులందరి సమక్షంలో వారి పెళ్లి జరిగింది. 


ఒప్పందం ప్రకారం ఉదల్‌కు సోనూ రూ.90 వేలు ఇచ్చేశాడు. పెళ్లి జరిగిన రోజు రాత్రి అందరూ ఇంట్లో నిద్రపోతుండగా నూతన వధువు అనిత ఒంటరిగా డాబా మీదకు వెళ్లింది. అక్కడ నుంచి ఆమె పరారైంది. ఆమెతో పాటు వచ్చిన వారు కూడా ఎవరూ కనిపించలేదు. దీంతో సోనూ కుటుంబానికి విషయం అర్థమైంది. డబ్బు కోసం వారందరూ కలిసి చేసిన మోసం గురించి తెలుసుకుని పోలీసులను అశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2021-07-31T16:36:52+05:30 IST