ఈ మహిళకు సరిగ్గా 20 రోజుల క్రితమే పెళ్లి.. అయినా పోలీస్ స్టేషన్‌లో ఇలా ఎందుకు కూర్చోవాల్సి వచ్చిందంటే..

ABN , First Publish Date - 2022-06-06T22:32:03+05:30 IST

పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళకు దాదాపు 20 రోజుల క్రితమే పెళ్లైంది. అయితే భర్తతో కలిసి ఆనందంగా జీవితాన్ని గడపాల్సిన ఆమె.. పోలీస్ స్టేషన్‌లో ఊచలు లెక్కిస్తూ కూర్చింది. కాగా.. ఇంతకూ ఆమె చేసిన తప్పేంటి. పోలీసులు

ఈ మహిళకు సరిగ్గా 20 రోజుల క్రితమే పెళ్లి.. అయినా పోలీస్ స్టేషన్‌లో ఇలా ఎందుకు కూర్చోవాల్సి వచ్చిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళకు దాదాపు 20 రోజుల క్రితమే పెళ్లైంది. అయితే భర్తతో కలిసి ఆనందంగా జీవితాన్ని గడపాల్సిన ఆమె.. పోలీస్ స్టేషన్‌లో ఊచలు లెక్కిస్తూ కూర్చింది. కాగా.. ఇంతకూ ఆమె చేసిన తప్పేంటి. పోలీసులు ఆ మహిళను ఎందుకు అరెస్ట్ చేశారు అనే పూర్తి వివరాలపై ఓలుక్కేస్తే..


పోలీస్ స్టేషన్‌లో అమాయకంగా కూర్చున్న ఈ మహిళ పేరు గగన్ దీప్. రాజస్థాన్‌లోని పిప్రాలీ ప్రాంతానికి చెందిన సురేశ్ కుమార్ శర్మా అనే వ్యక్తితో ఆమెకు గత నెల 15న వివాహం జరిగింది. సరిగ్గా పెళ్లైన 12 రోజులకు సురేశ్ కుమార్‌కు గగన్ దీప్ షాకిచ్చింది. ఇంట్లో ఉన్న సుమారు 12 తులాల బంగారం, రూ.75వేల నగదుతో పరారైంది. దీంతో సురేశ్ కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. ఓ మధ్య వ్యక్తి ద్వారా గగన్ దీప్ పెళ్లి చేసుకున్నానని.. అయితే ఆమె తనను మోసం చేసి డబ్బు, నగలతో ఇంట్లోంచి పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.



కేసు నమోదు చేసుకున్న అధికారులు.. ఆమె కోసం గాలింపు ప్రారంభించారు. ఈ క్రమంలోనే శ్రీగంగానర్ జిల్లాలోని ఇండియా-పాకిస్థాన్ సరిహద్దు వద్ద ఆమెను ఆరెస్ట్ చేశారు. కాగా.. పోలీసుల విచారణ సందర్భంగా సంచలన విషయాలు బయటపడ్డాయి. గగన్ దీప్‌కు ఇంతకు ముందే వివాహం జరిగిందనీ.. ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారనే నిజం వెలుగులోకి వచ్చింది. డబ్బు కోసం సురేశ్ కుమార్‌ను ఆమె పెళ్లి చేసుకున్నట్టు తేలింది.


Updated Date - 2022-06-06T22:32:03+05:30 IST