వైభవం..బ్రహ్మలింగేశ్వరస్వామి తీర్ధమహోత్సవం

ABN , First Publish Date - 2021-01-16T05:17:18+05:30 IST

బ్రహ్మలింగేశ్వరస్వామి వారి తీర్ధమహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. కనుమ రోజు తీర్థం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి ఆలయంలో అర్చకులు శంకరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి.

వైభవం..బ్రహ్మలింగేశ్వరస్వామి తీర్ధమహోత్సవం
స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు




వేపాడ: బ్రహ్మలింగేశ్వరస్వామి వారి తీర్ధమహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. కనుమ రోజు తీర్థం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి ఆలయంలో అర్చకులు శంకరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. గుడివాడ, జాకేరు, వేపాడ గ్రామాలకు చెందిన తోడపెద్దులను బాజా భజంత్రీల నడుమ దేవాలయానికి తీసుకొచ్చారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం జతరలో ఆనందంగా గడిపారు.  కృష్ణారాయుడుపేట కృష్ణారాయుడుస్వామి తీర్థ మహోత్సవం వేడుకగా జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నారు. ఎడ్ల పరుగు పందాల పోటీలు నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు హాజరయ్యారు.




Updated Date - 2021-01-16T05:17:18+05:30 IST