జలపాతంలో బాలుడు గల్లంతు
ABN , First Publish Date - 2022-08-07T05:24:23+05:30 IST
ఘాట్రోడ్డులోని సిద్దిలేశ్వరకోన జలపాతంలో ఒక బాలుడు గల్లంతైనట్లు ప్రచారం సాగుతోంది. నెల్లూరు నగరం దర్గామిట్ట (రాజరాజేశ్వరి గుడి)కి చెందిన పలువురు యువకులు శనివారం సిద్ధిలేశ్వరకోనకు వచ్చినట్టు సమాచారం.
రాపూరు, ఆగస్టు 6: ఘాట్రోడ్డులోని సిద్దిలేశ్వరకోన జలపాతంలో ఒక బాలుడు గల్లంతైనట్లు ప్రచారం సాగుతోంది. నెల్లూరు నగరం దర్గామిట్ట (రాజరాజేశ్వరి గుడి)కి చెందిన పలువురు యువకులు శనివారం సిద్ధిలేశ్వరకోనకు వచ్చినట్టు సమాచారం. యువకులంతా కలసి ఇక్కడి జలపాతంలో స్నానాలు చేశారు. వారిలో శశికుమార్ (16) నీటిలో గల్లంతైనట్లు తెలుస్తోంది. శశికుమార్ అన్న రాజేష్తోపాటు వచ్చినవారందరూ వెతికినా ప్రయోజనం లేదని తెలిసింది. సాయంత్రం 6గంటలకే ఈ విషయం తెలియడంతో పోలీసులు, అటవీశాఖ, ఫైర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునేందుకు సిద్ధం అయ్యారు. అంతలోనే వచ్చినవారందరూ ఉన్నట్లు తెలియడంతో ఊపిరిపీల్చుకున్నారు. అయితే రాత్రి 9గంటల ప్రాంతంలో శశికుమార్ తండ్రైన ఆటో డ్రైవర్ రాపూరులో తెలిసిన వారందరికీ ఫోన్ చేసి తన బిడ్డ రాలేదని చెప్పడంతో ఈ విషయం కాస్త వెలుగుచూసింది. ఈ విషయాన్ని జేసీ దృష్టికి బాధితులు శనివారం రాత్రి తీసుకువెళ్లినట్లు సమా చారం. గల్లంతైన బాలుడి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులు రాపూరుకు వస్తున్నట్లు సమాచారం.