వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-06-21T15:34:51+05:30 IST
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్మ చేసుకున్నారు. ఆర్కే సొసైటీలో నివసిస్తున్న ఫయాజ్ ఖాన్(33)కు పదేళ్ల క్రితం వివాహం అయింది. ఆయనకు ఇద్దరు పిల్లలు. కొన్ని నెలల
హైదరాబాద్/సనత్నగర్: వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్మ చేసుకున్నారు. ఆర్కే సొసైటీలో నివసిస్తున్న ఫయాజ్ ఖాన్(33)కు పదేళ్ల క్రితం వివాహం అయింది. ఆయనకు ఇద్దరు పిల్లలు. కొన్ని నెలల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య పిల్లలను తీసుకొని వెళ్లిపోయి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. భార్యను పంపించాలని అతడు అత్తమామలను పలుమార్లు కోరగా.. వారు పంపించలేదు. కొంతకాలంగా డిప్రెషన్లో ఉన్న అతడు ఆదివారం అర్ధరాత్రి ఇంటి కిటికీ చువ్వలకు తాడుతో ఉరేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడు..
బంజారాహిల్స్: ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12 పోచమ్మ దేవాలయం వద్ద నివసిస్తున్న బి. సంతోష్ లేబర్. సోదరి సరితతో కలిసి ఉంటున్నాడు. ఈనెల 9వ తేదీన పని నుంచి వచ్చి గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. చాలా సేపటి వరకు బయటకు రాలేదు. సరితకు అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్కు ఉరేసుకొని ఉన్నాడు. స్థానికుల సహాయంతో కిందకు దించి చూడగా కొన ఊపిరితో ఉన్నాడు. వెంటనే బంజారాహిల్స్ ప్రైవేట్ ఆస్పత్రికి అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.