ఇద్దరు మహిళా డాక్టర్లు... పెళ్ళితో ఒకటయ్యారు...

ABN , First Publish Date - 2022-01-07T01:22:54+05:30 IST

ఆ మహిళా డాక్టర్ల ఎనిమిదేళ్ళ ప్రేమాయణం... పెళ్ళికి దారితీసింది .

ఇద్దరు మహిళా డాక్టర్లు... పెళ్ళితో ఒకటయ్యారు...

హైదరాబాద్ : ఆ మహిళా డాక్టర్ల ఎనిమిదేళ్ళ ప్రేమాయణం...  పెళ్ళికి దారితీసింది . వారిద్దరూ త్వరలో ఒకటి కాబోతున్నారు. వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్ర లోని నాగపూర్ లో వారిద్దరూ డాక్టర్లుగా పనిచేస్తోన్న వారిద్దరూ.... తొలుత స్నేహితులు. ఆ స్నేహం ప్రేమగా మారింది. ఎనిమిదేళ్ళనుంచీ(2013) ఆ ప్రేమ కొనసాగుతూ వచ్చింది. వివాహం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. తొలుత ఆ డాక్టర్లిద్దరూ... విషయాన్ని తమ తమ తల్లిదండ్రులకు చెప్పారు. వారు అంగీకరించలేదు. ఆ క్రమంలో... ఆ మహిళా డాక్టర్లిద్దరూ ఒత్తిడి చేశారు. బెదిరించారు. దీంతో... ఆ రెండు కుటుంబాలు కూడా ఈ వివాహానికి అంగీకరించక తప్పలేదు. పిల్లల సంతోషమే తమ సంతోషమనుకోక తప్పని పరిస్థితి. ఇక... తల్లిదండ్రుల అంగీకారించడంతో... నాగపూర్ లో ఆ ఇద్దరు మహిళా డాక్టర్లిద్దరూ ఒక్కటయ్యారు. ఈ క్రమంలో... ఉంగరాలు, దండలు మార్చుకున్నారు.


జీవితాంతం కలిసి జీవించాలని మూడు ముళ్ళ బంధానికి వెళ్ళిన  డాక్టర్ పరోమిత ముఖర్జీ, సుర్భి మిత్రా. తమ బంధానికి సంబంధించిన వివరాలను ట్విట్టర్ లో ట్విట్టర్లో వెల్లడించారు. 

తమ సంబంధం జీవితాంతం కొనసాగించాలనేది తమ నిర్ణయమని, ఈ క్రమంలోనే... గోవా లో వివాహం చేసుకోబోతున్నట్లు డాక్టర్ పరోమిత చెప్పారు. తమ నిర్ణయంపట్ల తమ కుటుంబాల్లో వ్యతిరేకత లేదని పేర్కొనడం విశేషం. 


మొత్తంమీద విషయం ఆనోటా ఆనోటా పాకి ోలీసుల వరకు వెళ్ళింది. అయితే... పోలీసు వర్గాలు ఏమాత్రం స్పందించకపోవడం విశేషం. ‘అది వారిద్దరికీ సంబంధించిన విషయం. అయితే... ఆ వివాహం ప్రకృతి సమ్మతమైనది కాకపోయినప్పటికీ... మనం చేయగలిగిందేమీ లేదు. ఇదిలా ఉంటే...ఆ ఇద్దరు మహిళా డాక్టర్లను... వారి కుటుంబాలు తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... తమ వివాహానికి సంబంధించిన ఫోటోలు కానీ, ఇతరత్రా వివరాలను కానీ బయటపడకుండా ఆ ఇద్దరూ జాగ్రత్తపడినట్లుగా... వారి గురించి తెలిసినవారు చెబుతున్నారు. 

Updated Date - 2022-01-07T01:22:54+05:30 IST