బోరుబండి బోల్తా.. చత్తీస్‌గడ్‌ వాసి మృతి

ABN , First Publish Date - 2021-04-10T05:48:18+05:30 IST

జిల్లా కేంద్రం పరిధిలోని క్యాసంపల్లి శివారులో శుక్రవారం ఓ బోరుబండి బోల్తా పడటంతో చత్తీస్‌గడ్‌ రాష్ట్రానికి చెందిన వ్యక్తి మృతిచెందాడు.

బోరుబండి బోల్తా.. చత్తీస్‌గడ్‌ వాసి మృతి

కామారెడ్డి, ఏప్రిల్‌ 9: జిల్లా కేంద్రం పరిధిలోని క్యాసంపల్లి శివారులో శుక్రవారం ఓ బోరుబండి బోల్తా పడటంతో చత్తీస్‌గడ్‌ రాష్ట్రానికి చెందిన వ్యక్తి మృతిచెందాడు. దేవునిపల్లి ఎస్సై రవి కుమార్‌ తెలిపిన వివరాల ప్రకా రం.. బోరుబండిపై చత్తీస్‌గడ్‌ రాష్ట్రానికి చెందిన కాస్యపు అజేష్‌ (19) పని చేస్తున్నాడు. బోరును వేసేందుకు కామారెడ్డి మండలం క్యాసంపల్లికి బోరు బండిపై వెళుతుండగా బోరుబండి బోల్తాపడింది. అక్కడిక్కడే అజేష్‌ మృతి చెందాడు. బోరుబండి యాజమాని నరేందర్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహన్ని పోస్టమా ర్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిఆరు. పోస్టమార్టం అనంతరం కుటంబీకులకు శవాన్ని అప్పగించనున్నట్లు ఎస్సై తెలిపారు.


Updated Date - 2021-04-10T05:48:18+05:30 IST