బోర్ల తవ్వకాల నిషేధిత జాబితా నుంచి తొలగించాలి
ABN , First Publish Date - 2020-09-30T10:38:50+05:30 IST
మండలంలోని నాలుగు గ్రామాలను బోర్ల తవ్వకాల నిషేధిత జాబితా నుంచి తొలగింపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్, సంబందిత..
పొందూరు: మండలంలోని నాలుగు గ్రామాలను బోర్ల తవ్వకాల నిషేధిత జాబితా నుంచి తొలగింపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్, సంబందిత అధికారులకు స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. లోలుగు, తాణేం, బాణాం, తండ్యాం గ్రామాల్లో గతంలో తనిఖీల్లో తక్కువ భూగర్భజలాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వ్యవసాయ బోర్లు ఏర్పాటుకు నిషేధం విఽధించారు.ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో జలకళ పథకం లబ్ధిపొందడానికి అవకాశం లేకుండాపోయింది. దీంతో వైసీపీ నాయకుడు లోలుగు శ్రీరాములనాయుడు ఆధ్వర్యంలో ఆ నాలుగు గ్రామాల రైతులు, వైసీపీ నాయకులు స్పీకర్ను కలిశారు. స్పందించిన స్పీకర్ ఆయా గ్రామాల్లో భూగర్భ జలాలపై పరిశీలించి నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.