బోసిపోయిన రైల్వేస్టేషన్‌

ABN , First Publish Date - 2021-05-11T05:09:47+05:30 IST

ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌ బోసిపోతోంది. ప్రతిరోజూఈ స్టేషన్‌ మీదుగా 10 రైళ్లు రాకపోకలు సాగి స్తున్నాయి.

బోసిపోయిన రైల్వేస్టేషన్‌

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌  బోసిపోతోంది. ప్రతిరోజూఈ స్టేషన్‌ మీదుగా 10 రైళ్లు రాకపోకలు సాగి స్తున్నాయి. కరోనా ఉధృతి వల్ల ప్రయాణికులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. దీంతో  ఇక్కడ ప్లాట్‌ ఫారాలు నిర్మానుష్యంగా మారాయి. రిజర్వేషన్‌ చేయించుకున్న, ప్లాట్‌పారం టికెట్‌ తీసుకున్నవారికి మాత్రమే  స్టేషన్‌లోకి అనుమతిస్తున్నారు.  ఇచ్ఛాపురంలో సోమ వారం కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత దుకాణాలు మూతపడ్డాయి. సీఐ వినోద్‌బాబు, పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ రోడ్లపైకి వాహనచోదకులు, పాదచారులు రాకుండా గస్తీ ఏర్పాటుచేశారు.

 

Updated Date - 2021-05-11T05:09:47+05:30 IST