బోనమెత్తిన పల్లెలు

ABN , First Publish Date - 2021-07-31T05:06:49+05:30 IST

బోనమెత్తిన పల్లెలు

బోనమెత్తిన పల్లెలు
ధారూరులో బోనాలతో మహిళల ఊరేగింపు

ధారూరు/మోమిన్‌పేట :  ధారూరులో బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పోచమ్మ  దేవతకు గ్రామస్థులు  బోనాలు సమర్పించారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పుచప్పుళ్ల మధ్య మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మ వార్లకు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో సర్పంచు  చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు. మోమిన్‌పేట మండలం చిన్నకోల్కుంద గ్రామంలో దుర్గమ్మదేవతకు  గ్రామస్థులు బోనాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో  సర్పంచ్‌ కొనింటి సురేష్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T05:06:49+05:30 IST