ఈ ఆసనంతో శరీరం శక్తిమంతం!
ABN , First Publish Date - 2020-05-24T05:30:00+05:30 IST
ఈ ఆసనం మెదడును చల్లబరుస్తుంది. శరీరాన్ని శక్తిమంతం చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఈ ఆసనాన్ని అధోముఖ శ్వానాసనం అంటారు. ఇది ఎలా వేయాలంటే...
ఈ ఆసనం మెదడును చల్లబరుస్తుంది. శరీరాన్ని శక్తిమంతం చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఈ ఆసనాన్ని అధోముఖ శ్వానాసనం అంటారు. ఇది ఎలా వేయాలంటే...
- నేలపై బోర్లా పడుకోవాలి.
- నెమ్మదిగా చేతులపై లేస్తూ నడుము భాగం పైకి లేపాలి. అదే సమయంలో కాళ్లను దగ్గరకు తీసుకురావాలి.
- కాళ్లు మడవకూడదు. శరీరం గ ఆకారంలో ఉండేలా వంగాలి.
- అలా 30 సెకన్ల పాటు ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి.
- రెండు మూడు సార్లు ఈ ఆసనాన్ని వేయాలి.