యూపీలో మరో ఘాతుకం.. మహిళ మృతదేహాన్ని పెట్టెలో కుక్కి..

ABN , First Publish Date - 2020-10-01T21:38:01+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లో మహిళపై జరుగుతున్న దురాగతాలపై తీవ్ర ఆందోళ వ్యక్తమవుతున్న తరుణంలోనే...

యూపీలో మరో ఘాతుకం.. మహిళ మృతదేహాన్ని పెట్టెలో కుక్కి..

గోరఖ్‌పూర్: ఉత్తర ప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న దురాగతాలపై తీవ్ర ఆందోళ వ్యక్తమవుతున్న తరుణంలోనే ఇవాళ మరో ఘాతుకం వెలుగుచూసింది. 30 ఏళ్ల ఓ మహిళను చంపిన ఉన్మాదులు ఆమె మృతదేహాన్ని పెట్టెలో కుక్కి ఓ కాలువ గట్టున పడేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్పూర్ జిల్లా మణిరామ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళ మృతదేహంపై గాయాలేవీ కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఎరుపు రంగు దుస్తులు ధరించి, సింధూరంతో పాటు నుదుటిపై బొట్టు ఉన్నట్టు వెల్లడించారు.  ‘‘ఆమెను ఎక్కడో చంపి ఇక్కడికి తీసుకొచ్చి పడేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆమె మృతదేహాన్ని ఓ పెట్టెలో కుక్కి, మణిరామ్ ప్రాంతంలోని ఘొల్వాహ కాలువగట్టున పడేశారు...’’ అని ఎస్పీ (నార్త్) అర్వింద్ పాండే పేర్కొన్నారు. కుటుంబ కలహాల కారణంగానే ఆమెను హత్యచేసినట్టు భావిస్తున్నామని ఆయన అన్నారు. ‘‘మృతురాలి చేతిపై పచ్చబొట్టు ఉంది. బాక్సులోని మరో కవర్‌లో కొన్ని దుస్తులు, మంగళసూత్రం, మందులు ఉన్నాయి. నిందితులు ఆమెను గొంతు నులిమి చంపేశారు..’’ అని ఎస్పీ పేర్కొన్నారు. పోస్టుమార్టం తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి. మృతురాలి గుర్తింపు వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.

Updated Date - 2020-10-01T21:38:01+05:30 IST