మార్కెట్‌కు వెళ్తున్నామని ఇంట్లో చెప్పిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. మర్నాడే ఓ బావిలో 5 మృతదేహాలు.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-05-28T20:41:22+05:30 IST

ఆ ముగ్గురూ అక్కాచెల్లెళ్లు.. ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నాదమ్ముళ్లను పెళ్లి చేసుకున్నారు..

మార్కెట్‌కు వెళ్తున్నామని ఇంట్లో చెప్పిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. మర్నాడే ఓ బావిలో 5 మృతదేహాలు.. అసలేం జరిగిందంటే..

ఆ ముగ్గురూ అక్కాచెల్లెళ్లు.. ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నాదమ్ముళ్లను పెళ్లి చేసుకున్నారు.. ఈ నెల 25న ముగ్గురూ పుట్టింటికి వెళ్లారు.. మార్కెట్‌కు వెళ్తున్నామని చెప్పి బయల్దేరారు.. తమతో పాటు ఇద్దరు పిల్లలను కూడా తీసుకుని బయల్దేరారు.. ఎంత సేపటికీ తిరిగి రాలేదు.. దీంతో కుటుంబ సభ్యులు వారి కోసం తీవ్రంగా గాలించారు.. అయితే శనివారం ఉదయానికి ఐదుగురి మృతదేహాలు ఓ బావిలో లభ్యమయ్యాయి.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 


ఇది కూడా చదవండి..

కాలేజీ హాస్టల్‌లో ఓ గది ముందు ఓ యువతి కేకలు.. ఏమైందా అని అంతా కంగారుగా వెళ్లి చూస్తే..


రాజస్థాన్‌లోని జైపూర్‌కు సమీపంలోని దూదు గ్రామానికి చెందిన కాళీ దేవి (27), మమత మీనా (23), కమ్లేష్ మీనా (20) ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులను పెళ్లిళ్లు చేసుకున్నారు. వారిలో మొదటి ఇద్దరికీ పిల్లలు ఉన్నారు. కమ్లేష్ ప్రస్తుతం 8 నెలల గర్భవతి. వీరు ముగ్గురూ ఈ నెల 25వ తేదీన పుట్టింటికి వెళ్లారు. అదే రోజు సాయంత్రం మార్కెట్‌కు వెళుతున్నామని చెప్పి బయటకు వెళ్లారు. తమతో పాటు ఇద్దరు పిల్లలను కూడా తీసుకెళ్లారు. అయితే వారు ఎంత సేపటికీ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వారి కోసం తీవ్రంగా గాలింపులు చేపట్టారు. 


శనివారం ఉదయం గ్రామానికి సమీపంలోని ఓ బావిలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. వాటిని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక ఆధారంగా ఈ కేసులో ముందుకెళ్తామని పోలీసులు చెబుతున్నారు. 

Updated Date - 2022-05-28T20:41:22+05:30 IST