పడవ బోల్తా.. మత్స్యకారుడి మృతి
ABN , First Publish Date - 2020-08-10T10:41:23+05:30 IST
గెద్దలపాడు వద్ద సముద్రంలో పడవ బోల్తా పడిన ఘనటలో అదే గ్రామానికి చెందిన మత్స్యకారుడు సిరిగిడి అచ్చెయ్య ..
క్షేమంగా తీరానికి చేరిన మరో ముగ్గురు
సంతబొమ్మాళి, ఆగస్టు 9: గెద్దలపాడు వద్ద సముద్రంలో పడవ బోల్తా పడిన ఘనటలో అదే గ్రామానికి చెందిన మత్స్యకారుడు సిరిగిడి అచ్చెయ్య (36) మృతి చెందాడు. ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో అచ్చెయ్యతో పాటు గ్రామానికి చెందిన తుంబల మాధవరావు, నుత్తు గురువులు, తుంబల కామయ్యలు పడవపై చేపల వేటకు సము ద్రంలోకి వెళ్లారు. కొంచెందూరం వెళ్లేసరికి అలల తాకిడికి పడవ బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న నలుగురూ నీటిలోకి పడిపోయారు. వెంటనే మాధవరావు, గురువులు, కామయ్యలు అప్రమత్తమై పడవను సరిచేసి అచ్చెయ్య కోసం చూడగా కనిపించలేదు. దీంతో పడవపై గాలించగా కొన ఊపిరితో అచ్చెయ్య నీటిలో దొరికాడు.
ఒడ్డుకు తెచ్చి వైద్యం అందించేలోపే మృతి చెందాడు. అచ్చెయ్యకు భార్య చిన్నారితో పాటు, కుమా రుడు, కుమార్తె ఉన్నారు. స్థానిక వీఆర్వో హరిబాబు ఫిర్యాదు మేరకు సంతబొమ్మాళి ఎస్ఐ వి.కామేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంపీడీవో రాజేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు తెలు సుకున్నారు. ప్రభుత్వ పరంగా బీమా అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అచ్చెయ్య మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.